–అందుబాటులో ఉండాలి.. సమస్యలు పరిష్కరించాలి
–పారిశుధ్య పనులు నిత్యం చేయించాలి
-కలెక్టర్ అనురాగ్ జయంతి
బలగం టివి,సిరిసిల్ల:
జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల నియామకమైన ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి,సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు. సర్పంచ్ ల పదవి కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీ(జీపీ)లకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీపీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ఒక రోజు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ. ఈ నెల 7వ తేది నుంచి 15 వ తేది దాకా ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు చేపట్టనున్నామని ,ఈ కార్యక్రమాల్లో గ్రామంలోని యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలను అభివృద్ది చేసే మంచి అవకాశం స్పెషల్ ఆఫీసర్లకువచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ప్రతి గ్రామపంచాయతీలో నిత్యం మూడు పనులు ముఖ్య మైనవని ,గ్రామాల్లోని నీటి ట్యాంక్లకు నీరు వస్తుందా? లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే ట్యాంక్ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ నీరు సరఫరా అవుతుందా? లేదా చూసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య ఉందా అని గుర్తిoచాలని ,నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో చెత్త సేకరణ నిత్యం చేయాలని ,జీపీ ట్రాక్టర్ రోజు ఉదయం వెళ్ళేలా చూడాలన్నారు. తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని ,వీధి దీపాలు నిత్యం వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య పరిష్కారానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగించాలని అన్నారు. గ్రామ్మాల్లో ఆదాయ పన్ను వసూలు చేయించాలని ,గత ఏడాది జిల్లాలో 100 శాతం ఇంటిపన్ను వసూలు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ఏడాది80 శాతం పూర్తి అయిందని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు 100 ఇంటి వసూలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి వి, డిపివొ రవీందర్ ,మిషన్ భగీరథ ఇంట్రా ఈ ఈ జానకి తదితరులు పాల్గొన్నారు.
