బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సాగునీటి, త్రాగునీటి రంగంలో తో పాటు ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిఘా కేంద్రాలను వేములవాడ పట్టణం, పరిసర ప్రాంతాలు, అన్ని దారులను కలుపుతూ అమార్చడం అభినందనీయమని అన్నారు. దేవస్తానం ఆధ్వర్యంలో 12లక్షలతో 113 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో సీసీ కెమెరా వెయ్యి మందితో సమానమని అన్నారు. దొంగతనాలు, మర్డర్లు, సంఘ విద్రోహ చర్యలు తగ్గుముఖం పట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.మూడు మసాల క్రితం బాలికను కిడ్నాప్ చేసిన మూడు రోజుల్లో కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింద ని,పోలీసు శాఖ వారు కృషి అభినదనీయమని, దసరా రోజు కూడా డ్యూటీ చేస్తున్నారని అన్నారు.
సి ఎం రేవంత్ రెడ్డి పోలీసు కుటుంబ పిల్లలకు కోసం యంగ్ ఇండియా స్కూల్ ఎర్పాటు చేస్తున్నారని, ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.
రుద్రంగి పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం 2.50కోట్లు మంజూరు చేయడం జరిగిందని,వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీసు స్టేషన్, జిల్లా కేంద్రంలో మహిళా, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు.నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే క్యాంప్ కార్యాలయాన్ని డీఎస్పీ కార్యాలయనికి అప్పగించడం జరిగిందని అన్నారు.
భవిష్యత్ లో కూడా ఫ్రెండ్లీ పోలీసు కు అర్థం చెప్పేలా పోలీసుల విధులు నిర్వర్తించాలని,రిసెప్షన్ దగ్గర నుండి అధికారి వరకు స్టేషన్ కు వచ్చిన అందరికీ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పిటిషన్లు రాయడంలో తప్పులు లేకుండా చూడాలని,పిటిషన్ దారులు చెప్పినట్లే పిర్యాదులు రాయాలి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, పిటిషన్ మార్చడంతో బాధితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సమయం దుకాణాలు తెరిచి ఉంచేలా చూడాలని,దుకాణదారులను పోలీసులు ఇబ్బందులు పెట్టవద్దని,భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మనం చొరవ తీసుకోవాలని అన్నారు. గంజాయ్, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, మాదకద్రవ్యాల నివారణకు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి కొరకు నిష్టతో, కంకణ బద్దులమై పని చేస్తున్నామని,ఆదివారం శృంగేరీ పీఠం కు వెళ్ళి తుది అనుమతులు తీసుకువస్తామని అన్నారు.పట్టణాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అభివృద్ధి జరగాలంటే ఇబ్బందులు తప్పవు, అయినప్పటికీ వారికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.