బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- 150 లీడర్ బెల్లపానకం ధ్వంసం
- 14 లీడర్ల నాటు సారా స్వాధీనం
- 8 మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ : సీఐ శ్రీనివాస్
గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు జరిగాయని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గంభీరావుపేట మండలంలోని నాగంపేట్ ,సముద్ర లింగాపూర్, గజ సింగారం ,లక్ష్మీపూర్ తండాలలో దాడులు నిర్వహించి 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 14 లీటర్ల గుడుంబా రెండు కిలోల పటిక ను అను స్వాధీన పరుచుకుని నాటు సారాయి తయారుచేసి విక్రయిస్తున్న ఇద్దరి పై కేసులు నమోదు చేసి నాటు సారాయి అనుమానితులుగా ఉన్నటువంటి, పాత కేసులలో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఎనిమిది మంది బాదావత్ హంసి, భూక్య నాజీ, భూక్య చంద్రవ్వ, భూక్య తుకారాం, మాలోతు రాజవ్వ, భూక్య సుగుణ, బానోత్ నాన్కి, మాలోత్ లను తాసిల్దార్ & ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గంభీరావుపేట్ ముందు లక్ష రూపాయల పూచికత్తుపై బైండ్ ఓవర్ చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఈ దాడులలో డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ, సిబ్బంది రాజు, కిషోర్ వర్మ,శంకర్,రాకేష్,సుమన్, హమీద్ పాల్గొన్నారు. గ్రామాలలో నాటు సార తయారీ, రవాణా, విక్రయం ,నాటు సారాయికి ఉపయోగించే ముడి సరుకు రవాణా చేసిన, గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు.