బలగం టీవీ, తమిళనాడు:
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, దక్షిణాదిలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన ఏవీఎం స్టూడియోస్ (AVM Productions) అధినేత ఎం. శరవణన్ (85) ఈరోజు (తేదీ: డిసెంబర్ 4, 2025) తుదిశ్వాస విడిచారు.వయో సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా కొద్దికాలంగా చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
