సెస్ యాబై ఏళ్ల చరిత్రలో మొదటి అగ్నిప్రమాదం
దీపావళీ రోజు.. ఒకే ఫర్చెస్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదామా….? కుట్ర కోణమా..?
విచారణ జరుపుతున్న పోలీసులు.. సీసీ పుటేజ్ డీవీఆర్ స్వాధీనం
బలగం టివి న్యూస్:

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెస్ సంస్థ ఏర్పాటు ఐన 50 ఏండ్ల చరిత్రలో మొదటిసారి అగ్ని ప్రమాదం చోటు చేసకుంది. టఫాసులు కొడితే నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదం జరిగి ఉండోచ్చు అని సెస్ అధికారులు పేర్కొంటుండగా సిరిసిల్ల లో చర్చపచర్చలు కొనసాగుతున్నాయి. సెస్ లో అన్ని సెక్షన్ల కిటికిలు మూసి ఉంటే కీలకమైన సెక్షన్ పర్చెస్ సెక్షన్ గదికి సంబంధించిన కిటికిలు మాత్రమే తీసి ఉన్నాయని సమాచారం. టఫాసులు కొడితే ఫై ఫ్లోర్ లో ఉన్న కీలక సెక్షన్(ఫర్చెస్ సెక్షన్) లో కేవలం ఒకే సెక్షన్ లో అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెస్ చైర్మన్ గా చిక్కాల రామారావు, ప్రస్తుత పవర్ లూం అండ్ టెక్స్టైల్ కార్పోరేషన్ చైర్మన్ గతంలో సెస్ వైస్ చైర్మన్ గా గూడూరి ప్రవీణ్ పదవి బాధ్యతలు చేపట్టిన కాలంలో పలు అవినీతి అరోపణలు ఎదుర్కోన్నారు. ఆ కేసు ఇప్పటికి వెంటాడుతుంది. నాలుగు నెలల కిందనే విజిలెన్స్ అధికారులు పలు నోటీసులు జారీ చేశారు. 51 ఎంక్సైరీ కింద సెస్ అక్రమాలపై విచారణ కొనసాగుతుంది. తాజాగా విజిలెన్స్ అధికారులు పర్చెస్ సెక్షన్కు సంబందించిన 1 ఎప్రిల్ 2007 నుంచి 31మార్చీ 2011 వరకు పర్చెస్ సెక్షన్ లో జరిగిన లావాదేవిలు.. వర్క్ ఎస్టీమేట్లు, టెండర్ వర్క్, మెటిరియల్ కొనుగోళ్లు, స్టాక్ రిజిష్టర్లు బిల్లులు, చెక్ మేజర్మెంట్ బుక్స్, మెటిరియల్ పర్చెస్ అర్డర్స్, ఆసమయలో పని చేసిన అధికారుల వివరాలు.. లావాదేవీలు, కొనుగోళ్ల వివరాలు.. ఆడిట్ వివరాలు పూర్తి స్థాయి లో అందించాలని సెస్ కు విజిలెన్స్ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులిచ్చిన సెస్ స్పందించలేదు. తాము ఎప్పుడో జిల్లా కలెక్టర్కు ఈ వివరాలు అందించామని.. వారిని సంప్రదించాలని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మరో ఏడు రోజుల్లో సెస్ ఆడిట్ కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలో రెండవ సారి చిక్కాల రామారావు సెస్ చైర్మన్గా పదవి బాద్యతలు స్వీకరించాక.. విజిలెన్స్కు శాఖకు కూడా స్పందించకుండా సమాచారం ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ వస్తున్న తరుణంలో అగ్నిప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికల తరుణంలో చిక్కాల రామారావు పాలకవర్గాన్ని బదునాం చేయడానికి..ఇరుకున పెట్టేందుకు ఎవరైన ఈ కుట్రం పన్నారా..? లేదా ప్రమాదశాత్తు అయ్యిందా.. లేదా సెస్ సిబ్బంది పాత్ర ఉందా అన్న చర్చ కొనసాగుతుంది. ప్రతి సెక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాత కిటికిలు తీసేవేసి కొత్తగా స్లైడర్ విండోలు ఏర్పాటు చేశారు. టఫాసులు ఆఫీస్ ముందు కాల్చీన నిప్పు రవ్వలు అందులో పడే ఛాన్స్ లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే సెస్ పాలకవర్గం ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. విద్యుత్ బిల్లుల నిర్బంధ వసూళ్లు.. దళిత కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేతలతో సెస్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిర్బంద విద్యుత్ బకాయిల వసూళ్లకు స్వస్తి చెప్పి.. వాయిదాల పద్దతిలో వసూలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ అగ్ని ప్రమాదం తో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు క్షేత్ర స్థాయి విచారణ జరుపుతున్నారు. సెస్ కార్యాలయంనకు సంబంధించిన సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. పర్చెస్ సెక్షన్ ఇంచార్జీలు ఎవరు, గతంలో ఎవరు పని చేశారు.. సెస్ లో పర్చెస్ సెక్షన్కు సంబంధించిన ఏం ఏం ఆరోపణలు ఉన్నాయి.. ఈ సెక్షన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా…? లేవా..? ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా..? లేదా ఏమైన కట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

రెయిన్ కోట్స్ కొనుగోలు చేశారు.. సిబ్బందికి పంపిణి చేయలేదు
సిరిసిల్ల సెస్ సంస్థలో పని చేసే సిబ్బందికి ప్రతి వర్షాకాలంలో రెయిన్ కోట్స్ సంస్థ సొమ్ముతోనే కొనుగోలు చేసి పంపణి చేస్తారు. కానీ మొన్నటి వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన విద్యుత్ సిబ్బందికి రెయిన్ కోట్స్ పంపిణి చేయలేదు. అగ్ని ప్రమాదం జరిగిన గదిలో సూమారు 300 లకు పైగా రెయిన్ కోట్స్ బయటపడ్డాయి. అగ్నికి సగానికి పైగా దహనమయ్యాయి. పర్చెస్ సెక్షన్ లో అగ్ని ప్రమాదంలో ఈ రెయిన్ కోట్స్ విషయం బహిర్గతమైంది. సెస్ పాలకవర్గం లేకుండా సెస్ అధికారుల సంరక్షణలో నడిచినప్పుడు సాఫీగా నడిచిన సెస్ నిర్వహణ.. నూతనంగా సెస్ ఎన్నికలు జరిగి.. చిక్కాల రామారావు రెండవ సారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక సెస్ మళ్లీ వివాదంలోకి వెళ్తుందన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల సెస్ పాలకవర్గ పనితీరు మంత్రి కేటీఆర్కు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైన పోలీసులు, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ ఏం విషయం తెలియదు. సెస్ లోని సమాచారం.. పర్చెస్ సెక్షన్ వివరాలు కీలక ఫైళ్లు విజిలెన్స్ అడిగిన సమాచారం మొత్తం సెస్ పాలకవర్గం అందిస్తే ఇందులో ఏం కుట్ర కోణం లేదని తేటతెల్లమవుతుందని, ఇవే ఫైళ్లు దహనమైతే మాత్రం అనుమానాలు మిగిలిపోతాయమని సిరిసిల్లకు చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం కుట్ర కోణంలో చర్చ మాత్రమే కొనసాగుతుంది. టఫాసులతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండోచ్చని సెస్ లో ఓ అధికారి వెల్లడించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావుపై, అప్పటి వైస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తో పాటు అప్పటి పాలకవర్గంపై కేవలం ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో రుజువు కాలేదని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాల కుట్రగానే భావిస్తున్నారు.