బలగం టీవీ, హైదరాబాద్ :
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ఏపీ ప్రతిపాదించగా, తొలిదశ కింద 135 అడుగులకే కుదించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులు ఉంటే తెలంగాణాలో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రాజెక్ట్ ఎత్తును కుదించాలని సూచించింది.