బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పోలీస్ అధికారులకు,సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్యలు వుంటే ఉన్నతాధికారులకు తెలియజేయండి.
పోలీస్ అధికారుల,సిబ్బంది సంక్షేమం కోసం పోలీస్ శాఖ కట్టుబడి ఉంది.
శాంతి భద్రతల పరిరక్షణకు ముందుండే అధికారుల,సిబ్బంది యొక్క భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి.
రాష్ట్రంలో మొదటి సారిగా సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అధికారులకు,సిబ్బందికి మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్..
శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది,అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్& టీం చే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ హాజరైనారు.
ఈ అవగాహన సదస్సులో పోలీసు అధికారులు,సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడులపై సమగ్ర అవగాహన ఇచ్చారు.ముఖ్యంగా నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలి ఎలా పరిష్కరించుకోవలెనే మార్గాల, ఒత్తిడి నిర్వహణ,మానసిక స్థైర్యం,ఆత్మవిశ్వాసం పెంపు, కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత, ఫైన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాల పై అవగాహన, పలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ , ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని అట్టి సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.సిబ్బంది అధికారుల మానసిక స్థితి, మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా పొలిస్ అధికారులకు, సిబ్బందికి మానసిక ఆ అగహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్య వుంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకరవలని ఆయా సమస్యల పరిష్కరనికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వ్యక్తిగత సమస్యలకు గురై ఒంటరిగా ఉన్నామనే భావన నుండి బయటకు రావాలని మీ భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత కలిగి ఉండాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రతి నెల సిబ్బందితో సవేశాలు నిర్వహించి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవలన్నారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రాణాలను, కుటుంబ సభ్యులను ప్రమాదంలో పెట్టవద్దని అధికారులు, సిబ్బంది విరామ సమయంలో కుటుంబలతో గడపాలని తెలిపారు.
మహిళ సిబ్బందికి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని,మహిళ సిబ్బందికి అన్ని రకాల అండగా ఉంటామని ఎస్పి తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖ జిల్లా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు,యోగ తరగతులు, క్రీడలు చేపడుతు సిబ్బందిలో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు. నిత్యం యోగ,వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదురుకోవచ్చని అధికారులకి, సిబ్బందికి సూచించారు. పిలువగానే వచ్చి జిల్లా అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర ఆత్మహత్యలు నివారణ సంస్థ టీమ్ సబ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆత్మహత్యలు నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ, సైకాలజిస్ట్ లు శైలజ, రామోజిరావు, బోడా అరుణ, సి.ఐ మొగిలి, మధుకర్, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు రమాకాంత్, రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.