కేసును సేదించిన పోలీసులు
బలగం టీవీ, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.తేదీ 22-04-2025 రోజున మర్లపేట గ్రామ శివారులో చంద్రగిరి రాకేష్ (24) బోయినిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయినాడని మృతుని తండ్రి సంద్రగిరి మల్లేశం ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయనైనది. మృతుని వద్ద దొరికిన మరణ వాంగ్మూలంలో రాసిన నలుగురు వ్యక్తులను పిలిచి విచారించగా సదరు నలుగురు వ్యక్తులు మృతుని యొక్క వ్యక్తిగత ఫోటోలు గూగుల్ షేర్ ద్వారా నలుగురు వ్యక్తులు ఒకరికి ఒకరు పంపించుకుని అట్టి ఫోటోలు బయట పెడతామని నలుగురు వ్యక్తులు మృతుని బెదిరించి, మృతుడు చనిపోయే విధంగా ప్రేరేపించినారని అట్టి ఫోటోలు బయటకి వస్తే తన పరువు పోతుందని సదరు నలుగురు వ్యక్తుల బెదిరింపులకు భయపడి మృతుడు మర్లపేట గ్రామ శివారులోని చెరువులో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినాడని మృతిని చావుకు బోయినిపల్లి గ్రామానికి చెందిన తన స్నేహితులు నలుగురు యువకులు కారణమని విచారణలో తేలగా, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి తేదీ 26-04-2025 రోజున రిమాండ్ కు పంపించామని మండల ఎస్సై పృథ్వీధర్ గౌడ్ అన్నారు.