బలగం టీవీ, తంగళ్ళపల్లి:
మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ వారిచే మండేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామంలోని రెడ్డి సంఘ భవనంలో శనివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 మంది వరకు బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాధగోని సాగర్,ఉప సర్పంచ్ యాస సందీప్, వార్డ్ మెంబర్ తిమ్మానగరం దేవదాస్,గ్రామస్తులు రాగిపెల్లి కిష్టారెడ్డి, సద్దా ప్రసాద్, చిలుక విశ్వనాథం, సందిరీ గాల్ రెడ్డి, గోనపెల్లి రామచంద్రం కార్యదర్శి ముదం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
