బలగం టీవీ, హైదరాబాద్:
కూకట్పల్లిలోని రాందేవ్ రావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్, సీఈఓ డాక్టర్ యోబు ఆధ్వర్యంలో భారీ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో భాగంగా GHMC కార్మికులకు రూ. 10 లక్షల విలువైన ఉచిత మందులను పంపిణీ చేశారు. దాదాపు 2500 మంది కార్మికులు ఈ క్యాంప్లో లబ్ధి పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ హాజరయ్యారు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్-రే (AI-XRAY) వార్డును ప్రారంభించారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ఈసీజీ-2డీ ఎకో (ECG-2D ECHO) వార్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహిస్తున్న రాందేవ్ రావు హాస్పిటల్ నిర్వహకులను అభినందించారు. GHMC కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
