బలగం టీవీ, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల కోసం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ (ఐసీఐ) ఆధ్వర్యంలో ఉచిత మోటివేషనల్ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసీఐ రీజినల్ ప్రెసిడెంట్ శ్రీ కుతాడి తిరుపతి మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సరైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. సెలవుల్లో కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆరోగ్యం జాగ్రత్త వహించడం, పెద్దలను గౌరవించడం వంటివి చేయాలని పేర్కొన్నారు.
ఐసీఐ రీజినల్ డైరెక్టర్ శ్రీ ఆవుల సుధాకర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు సెలవుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయాలని, బంధువులు, పెద్దల ప్రశంసలు పొందేలా నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రతిభ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొని శ్రీ కుతాడి తిరుపతి, శ్రీ ఆవుల సుధాకర్ లను సన్మానించారు.