బలగం టీవీ, న్యూ ఢీల్లీ:
ఆపరేషన్ సిందూర్తో భారత్ చేసిన మెరుపు దాడులకు పాకిస్థాన్ రగిలిపోతోంది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనయాన్ మిషన్కు ఎంపికైన వ్యోమగామి అజిత్ కృష్ణన్ తిరిగి భారత వాయుసేన (IAF) సేవల్లో చేరారు. 2027లో చేపట్టబోయే భారత్ తొలి మానవసహిత గగనయాన్ మిషన్కు శిక్షణ పొందుతున్న అజిత్కు IAF నుంచి పిలుపు రావడంతో తిరిగి విధుల్లో చేరినట్లు వెల్లడించారు.