బలగం టీవీ, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని గీత విద్యాలయం గ్రౌండ్లో జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ 2025 ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారిరువురూ క్రీడాకారులను ప్రత్యేకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వారు టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లు సరదాగా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడారు. క్రీడాకారులు, అతిథులు కలిసి ఆనందంగా గడిపారు.