బలగం టివి ,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క,ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గార్లతో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు తేదీ 27-01-2024 శనివారం రోజున సిరిసిల్ల,వేములవాడ నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..
సాగునీటి పై ప్రత్యేక దృష్టి
-ప్రభుత్వం సాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.. కథలాపూర్,మేడిపల్లి,భీమారం మండల ప్రజల తాగు, సాగునీటికి ఎంతో ఉపయోగపడే కలికోట సూరమ్మ చెరువు కుడి,ఎడమ కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు..
- వేములవాడ రూరల్ మర్రిపెళ్లి గ్రామంలోని మర్రిపల్లి చెరువు, కోనరావుపేట మండలంలోని లచ్చంపేట చెరువులను రిజర్వాయర్ లుగా మార్చడానికి నిధులు విడుదల చేయాలని కోరారు.
- భీమారం మండలం గోవిందారం చెరువులోకి పోతారం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు..
-సిరిసిల్ల జిల్లా పరిధిలో ఎగువ మానేరు 9వ ప్యాకేజ్ పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా కోరారు..
విద్యా పై ప్రత్యేక దృష్టి
- అగ్రహారం డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
ఆలయ అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు, వేములవాడ పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు, VTDA(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ)పరిదిలో జరిగే అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు..
-త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన VTDA(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది..