బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ పట్టణంలో మహాలక్ష్మీ వీధిలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.


