బలగం టీవీ, మంగళూరు:
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ కటీల్ దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. మంగళూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటీల్లోని ఈ ఆలయానికి ఆయన ఆలయ ఈఓ కె. వినోద్, ఆర్కిటెక్ట్, స్థపతి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెళ్లారు.
ఆలయంలోని పూజా కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
