బలగం టీవీ, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లోని శ్రావణ్ కన్వెన్షన్లో వేములవాడ ఆర్డీవో సోమ రాజేశ్వర్ కుమార్తె హేమలత, వేదాంత్ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మెన్ మనాల మోహన్ రెడ్డి, రాష్ట్ర సైడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి, జువ్వాడి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.
