బలగం టీవీ, చందుర్తి :
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, కట్ట లింగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.
భక్తుల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవం కన్నుల పండుగలా సాగింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని పాల్గొన్న వారంతా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, చందుర్తి మాజీ ఉపసర్పంచ్ చిర్రం తిరుపతి, పెరుక రంజిత్, గుడిపెల్లి హరీష్, మారుపాక మహేష్, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గుడిపల్లి తిరుపతి, జంగిలి లక్ష్మీ నరసయ్య, జంగిలి శ్రీనివాస్, ఆత్మకూరి చందు, జంగిలి ప్రశాంత్, జంగిలి నవీన్, గొట్టం రాజు, జంగిలి నరేష్ మరియు ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
