బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
15 గంజాయి కేసులలో నిందుతునిగా ఉండి 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్.
జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన,రవాణా చేసిన సేవించిన వారి సమాచారం అందించండి.
జిల్లాలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై పటిష్ట నిఘా: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం, సాగు, మరియు వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో 15 గంజాయి కేసులలో నిందితుడిగా ఉన్న మహమ్మద్ (23), స్వస్థలం సిరిసిల్ల, రఫీక్ కుమారుడు, ఐదు కేసులలో పరారీలో ఉండగా, సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఎల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్టు చేయబడ్డాడు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగాలపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్లలో ఈ నిందితుడిపై 15 కేసులు నమోదు కాగా, సిరిసిల్ల పట్టణంలో 4, చందుర్తిలో 1 కేసులో పరారీలో ఉన్నాడు. అరెస్టు తర్వాత విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ మాట్లాడుతూ, గంజాయి అక్రమ కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి విక్రయం, సాగు, రవాణా, మరియు వినియోగంలో పాల్గొన్న వారి సమాచారాన్ని RS-NAB 8712656392 నంబర్కు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన కోరారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఇంతియాజ్ ఉన్నారు. జిల్లాలో గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్నవారిపై కూడా కఠిన నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు.