ఏసీబీకి చిక్కిన HNK అడిషనల్ కలెక్టర్
బలగం టీవీ, హనుమకొండ:
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇంచార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండె డ్ గా పట్టుబడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ లంచం విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారానికి గాను తీసుకున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో పాటు, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
