రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 15 నుండి సదరం శిబిరాలు..

0
297

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దివ్యాంగులకు శుభవార్త..

జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో డిసెంబర్ 2025 సదరం క్యాంపుల నిర్వహణ తేదీలు ఖరారు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 15, 2025 నుండి డిసెంబర్ 20, 2025 వరకు సదరం (SADAREM) శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. దివ్యాంగులకు UDID సర్టిఫికెట్ల జారీ కోసం ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత వైద్యుల సూచనల మేరకు వివిధ విభాగాలకు సంబంధించిన క్యాంపుల తేదీలను, పరీక్షించబడే దివ్యాంగుల సంఖ్యను వివరంగా ప్రకటించారు.

క్రమ సంఖ్యక్యాంపు తేదీరోజువిభాగము
115.12.2025సోమవారంకంటిచూపు – 21
2 16.12.2025మంగళవారంఆర్తో – 45
316.12.2025మంగళవారంమానసిక – 25
417.12.2025బుధవారంమానసిక – 20
517.12.2025బుధవారంజనరల్ – 06
917.12.2025బుధవారంవినికిడి (Hearing) – 35
618.12.2025గురువారంఆర్తో – 45
1018.12.2025గురువారంవినికిడి (Hearing & Speech & Language) – 36
719.12.2025శుక్రవారంఆర్తో – 45
820.12.2025శనివారంఆర్తో – 45

పైన తెలిపిన తేదిలలో సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు ఉదయం 09:30 గంటలకు చేరుకోవాలి. తమ వెంట మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్-రే, UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలి. సదరం క్యాంప్‌కు హాజరయ్యే వారి పేర్లు మరియు వివరాలు ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి / మున్సిపాలిటీలలో బిల్లు కలెక్టర్‌కు పంపడం జరిగింది. ఈ వివరాలను మండల అభివృద్ధి అధికారులు మరియు కమిషనర్లు (సిరిసిల్ల, వేములవాడ) తమ పరిధిలోని దివ్యాంగులకు తెలియజేసి, వారికి సమాచారం అందేలా చూడాలని కోరనైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here