పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్..

బలగం టీవీ, న్యూ ఢీల్లీ:

భారత్-పాక్‌ మధ్య ఉద్రి క్తతలు మరింత ముదు రుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమ య్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్‌ సరఫరా నిలిపివేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాసంస్థలు మూసివేశారు.

పోలీసుల, ఇతర అధి కారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో సహా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి.

పంజాబ్‌ సర్కాక్​ అక్కడి పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేసింది. సరిహద్దు లోని 6 జిల్లాల పరిధిలో పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటిం చింది. ఫెరోజ్‌పుర్‌, పఠాన్‌ కోట్‌, ఫజిల్కా, అమృత్‌ సర్‌, గుర్‌దాస్‌పుర్‌, తర్న్‌ తరన్‌ జిల్లాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపింది.

దీంతో పాటు చంఢీగడ్‌ సహా అనేక జిల్లాల్లో విద్యు త్ సరఫరా నిలిపివేశారు. ఉద్రిక్తతల వేళ చాలా అప్రమత్తంగా ఉన్నామని పంజాబ్‌ మంత్రి ఆమన్‌ ఆరోరావెల్లడించారు .హరియాణాలోనూ పోలీసు సిబ్బంది సహా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. వారు పనిచేస్తున్న ప్రాంతాల్లోనే ఉండాలని అన్ని జిల్లాల సివిల్‌ సర్జన్ల కు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కేంద్రాన్ని వీడి వెళ్లవద్దని స్పష్టం చేశారు.

దిల్లీ సర్కార్​ కూడా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశమున్న వేళ, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ అధికారికీ సెలవులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే సంసిద్ధత కోసం ఆయా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

పంజాబ్‌ సరిహద్దు కలిగిన హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. హమీ ర్‌పుర్‌, ఉనా, బిలాస్‌పుర్‌ సహా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాబా బాలక్‌నాథ్‌, మాతా చింత్‌పుర్నీ, మాతా నైనా దేవీ వంటి ప్రముఖ దేవాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. రాజస్థాన్‌ గవర్నమెంట్​ కూడా పోలీసుల, ఇతర శాఖల ఉద్యోగుల సెలవుల ను రద్దు చేసింది. 5 సరి హద్దు జిల్లాల్లోని స్కూళ్లను మూసివేసింది.

పశ్చిమ రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాల్లో విద్యుత్​ సరఫరా నిలిపివేసింది. బార్మర్‌, జైసల్మేర్‌, జోధ్‌పుర్‌ సహా పలు జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం వరకు బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలో లైట్లను ఆపేయాలని పోలీసులు సూచించారు. మే 10వ తేదీ వరకు బిక నెర్‌, అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌, జోధ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించా రు.గుజరాత్‌ తీర ప్రాంతం లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయడం తోపాటు, సెలవుల్లో ఉన్న వారిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.

గుజరాత్‌కు భూ, సముద్ర సరిహద్దు ఉంది. రాజ్‌కోట్‌ రేంజ్‌, జామ్‌నగర్‌, మోర్బీ, దేవ్‌భూమి, ద్వారక జిల్లాలకు తీర ప్రాంతం ఉంది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచిన అధికారులు, ఏమైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే తెలియజేయాలని గ్రామ ప్రజలు, సర్పంచ్‌లకు సూచించారు.పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారు వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది. బిహార్‌ ప్రభుత్వం కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

istanbul escortjojobetistanbul escort bayanholiganbetfatih escortbeşiktaş escortgamdomtipobet girişistanbul escortnerobetdeneme bonusucratosroyalbetgrandpashabetgrandpashabetjojobetgrandpashabetjojobetjojobetkingroyal girişbetebetvbetdeneme bonusu veren sitelerjojobetkonya eskortGrandbettingMatbetmatbetHoliganbet sahabetBetebetOnwinOnwinimajbetkocaeli Escortmarsbahisjojobetşişli, escortmatbetaras kargocasibomjojobethalkalı escortdeneme bonusugüvenilir bahis siteleriperabetgrandpashabet girişgrandpashabet girişgrandpashabet girişperabetholiganbet girişbetturkeyholiganbetgrandpashabetdeneme bonusu veren sitelerholiganbetTipobetultrabetHoliganbetdeneme bonusu veren sitelerMarsbahiscasibom

Jeetwin

Jeetbuzz

Baji999

SekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabet GirişSekabet Güncel GirişAsyabahis GirişSekabetSekabet GirişSekabetSekabet GirişSekabetSekabet Girişsekabetsekabet girişSekabet Giriş