బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన విద్యార్థిని సహాయ ఫౌండేషన్ వారు ఘనంగా సన్మానించారు.
దుమాల గ్రామానికి చెందిన అర్పిత ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి నిన్నటి రోజు వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి 600 /574 మార్కులు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎండి షాదుల్, సహా ఫౌండేషన్ అధ్యక్షులు లద్దునూరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఘనగోని సంతోష్, దుబ్బాక సతీష్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, టిఆర్ఎస్ మాజీ జడ్పీ జిల్లా కోఆప్షన్ ఎండి చాంద్ పాషా, కోలా బాబు రెడ్డి అజీజ్ శరవీంద్ చెట్కూరి రాజు భాస్కర్ లు శాలువా కప్పి ఘనంగా సన్మానించి ఆమెను అభినందించారు. పేదింటి విద్యార్థి చిన్న గ్రామంలో అత్యధిక మార్పులు సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చినందుకు ఎంతో గర్వకారమన్నారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలని వారు ఆశీర్వదించారు.