సర్పంచ్ అభ్యర్థి సుద్దాల మధు
బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి సర్పంచ్ గా తనను గెలిపేస్తే ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా గ్రామ అభివృద్ధికి పాటు పడతానని సర్పంచ్ అభ్యర్థి సుద్దాల మధు తెలిపారు.ఈ నెల 14 న ఎన్నికల్లో తన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ఓటర్లను అభ్యర్థున్నాడు.యువత మహిళలు గ్రామస్తులు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు.గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, గ్రామ ప్రజల ఆశలు వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అసంపూర్తిగా గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనం, వేణుగోపాల స్వామి ఆలయం నిర్మిస్తానని తెలిపారు.
