- ఇల్లంతకుంట, వల్లంపట్ల, సారంపల్లిలో సందర్శన.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల్లో భాగంగా పలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రం, వల్లంపట్ల, తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందర్శించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, తహసీల్దార్ జయంత్, ఎంపీడీఓలు శశికళ, లక్ష్మీనారాయణ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.



