బలగం టీవీ, హైదరాబాద్ :
భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా ఆ ఒప్పందాన్ని నిలిపేయడంతో పాక్ లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. సింధుకు ఉపనదులైన చీనాబ్ 1 జీలం నదులు భారత్లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు.. భారత్ నుంచి పాక్ లోకి ప్రవహిస్తుంది.