బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కెసిఆర్ సభా స్థలాన్ని సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ చల్మెడ బృందం..
ఈనెల 27 ఆదివారం వరంగల్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ రజతోత్సవ సభ స్థలాన్ని శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్ని మండలాల ముఖ్య నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి వచ్చే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వేములవాడ మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

