బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గౌడ సోదరులు నిర్వహించనున్న శ్రీ జమదగ్ని రేణుక ఎల్లమ్మ సిద్దోగానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్, పిల్లి కిషన్, శ్రీధర్ గౌడ్ మరియు గౌడ సంఘం నాయకులు బుధవారం తోట ఆగయ్య ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ సిద్దోగం వేడుకలకు హాజరుకావాలని వారు కోరారు. తోట ఆగయ్య సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.