బలగం టీవీ, హైదరాబాద్ :
పటాన్ చెరు మున్నూరుకాపు సంఘం పాలక మండలి ఈనెల 4వతేదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తుంది.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మున్నూరుకాపు సంఘం భవనంలో ఆ రోజు సాయంత్రం 4గంటలకు జరిగే కార్యక్రమానికి, ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రముఖులు డాక్టర్ నర్ర భిక్షపతి,మనం దినపత్రిక సంపాదకుడు ఉప్పరి రమేష్,నాయికోటి జీతయ్య తదితరులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.అలాగే,ఈ సందర్భంగా ఏంకే మహాలక్ష్మీ,ఏంకే చేయూత పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఎంపీ రవిచంద్రకు వారు వివరించారు.