బలగం టీవీ, హైదరాబాద్:
కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొండగట్టులో జరిగిన నష్టం వివరాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడమే ఆస్తి నష్టం భారీగా జరగడానికి ప్రధాని కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
