సిరిసిల్ల లో ‘లగిశెట్టి’ నామీనేషన్​ ర్యాలీ సంచలనం..

8వేల జనసముహాంతో పద్మశాలీ సంఘ నేత లగిశెట్టి నామీనేషన్​2 వేల ఓట్లు రావని కామేంట్​ చేసిన నేతల ముందే 8వేల మందితో బారి ర్యాలీ

మేజార్టీ ఓట్లున్న సామాజికి వర్గం నుంచి ఇద్దరు బరిలో..

అయోమయంలో బీఆర్​ఎస్​ శ్రేణులు.. లక్షా మేజార్టీపై తర్జన భర్జన

పగబట్టి బీఆర్​ఎస్​ నుంచి బయటకు వెళ్లెలా చూసిన సిరిసిల్ల నేతలు

రాజకీయ పదవులకు అడ్డోస్తడనే నెపంతో సిరిసిల్ల ముఖ్య నేతల కుట్ర

పథకం  ప్రకారమే మంత్రి కేటీఆర్​కు లగిశెట్టిని దూరం చేసిన ముఖ్య నేతలు

బీఆర్​ఎస్​కు రాజకీయ సంకటంగా మారిన లగిశెట్టి శ్రీనివాస్​

సిరిసిల్ల న్యూస్​:

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ప్రతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయంగ పెను మార్పులు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్​ను సొంత పార్టీ నాయకులే పుట్టి ముంచుతున్నరన్న చర్చ కొనసాగుతుంది. సిరిసిల్ల రాజకీయాలపై సమయం కేటాయించకుండా మంత్రి కేటీఆర్​ హైదరాబాద్​ కే పరిమితం కావడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మంత్రి కేటీఆర్​కు అభిమానులుగా.. శ్రేయోభిలాషులుగా ఉన్నవారంత దూరమవుతు వస్తున్నారు. బీఆర్​ఎస్​ క్యాడర్​ లో చీలికలు ఏర్పడ్డాయి. డబ్బులు ఇస్తే కానీ పని చేయని ప్రజాప్రతినిధులు తయారయ్యన్న విమర్శలు వినవస్తున్నాయి. పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరిసిల్ల సెస్​ మాజీ వైస్​ చైర్మన్​, సామాజిక సేవకులు లగిశెట్టి శ్రీనివాస్​ బారి జనసమీకరణతో.. సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు నామీనేషన్​ వేశారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజం నుంచి సూమారు 8 వేల మందికి పైగా ఈ నామీనేషన్​ కార్యక్రమానికి హజరయ్యారు. సిరిసిల్ల మంచి పేరున్న లగిశెట్టి శ్రీనివాస్​ వ్యాపారవేత్తగా.. సామాజిక సేవకులుగా.. వందల మందికి పుస్తె మట్టెలు, ఆర్థిక సాయాలు అందించిన వ్యక్తిగా సుపరిచితులు. బీఆర్​ఎస్​ లో చేరిన లగిశెట్టి శ్రీనివాస్​ అనతికాలంలోనే సెస్​ వైస్​ చైర్మన్​గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నాడు. బీఆర్​ఎస్​ ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామీనేట్​ పోస్టులో కొనసాగుతున్న వ్యక్తికి లగిశెట్టికి రాజకీయంగా వైరం ఏర్పడి.. పార్టీకి దూరంగా ఉంటు వచ్చాడు. ఈ వివాదంపై మంత్రి కేటీఆర్​ కూడా పట్టించుకోకపోవడం.. రెండేళ్లు పార్టీకి దూరంగా ఉన్న కూడా పార్టీ నాయకులు కార్యక్రమాలకు ఆహ్వనించకపోవడంతో మనస్థాపం చెందిన లగిశెట్టి శ్రీనివాస్​ బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపిలో చేరారు. మంత్రి కేటీఆర్​ పలుసార్లు లగిశెట్టి శ్రీనివాస్​ తో మాట్లాడి బుజ్జగించాలని పార్టీ శ్రేణులుకు ఆదేశించిన స్థానిక నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. మంత్రి కేటీఆర్​కు లగిశెట్టి శ్రీనివాస్​ పై తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు లగిశెట్టి తానంతట తానే పార్టీ నుంచి బయటకు వెళ్లెలా ప్రణాళిక బద్దంగా చేశారు. తనను రెండు ఏళ్లుగా పట్టించుకోకపోవడమే కాకుండా తన కొడుకు కరోనా సమయంలో వేరే దేశం ఎయిర్​పోర్టులో చిక్కుకుంటే మంత్రి కేటీఆర్​ స్పందించలేదని మనస్థాపం చెంది ఏకంగా బీజేపి పార్టీలో చేరి ఎమ్మెల్యే పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.బీజేపి పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వకపోవడంతో భంగపడ్డ లగిశెట్టి శ్రీనివాస్​ బీజేపి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్నారు. మంత్రి కేటీఆర్​ మేనభావ చీటీ నర్సింగరావుకు వ్యాపార భాగస్వామిగా.. అతి సన్నిహితుడిగా ఉన్న లగిశెట్టి ఏకంగా మంత్రి కేటీఆర్​ పైనే పోటీ చేయడం సిరిసిల్ల లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. సిరిసిల్ల అతిపెద్ద ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం పద్మశాలీయుల తరుపున ఈ సారి లగిశెట్టి శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల లో అనతికాలంలోనే యూత్​ ఫాలోయింగ్​ సంపాదించి..ఆధ్యాత్మీక కార్యక్రమాలతో సిరిసిల్ల పట్టణ జనంను ఆకట్టుకున్న పత్తిపాక సురేష్​ కూడా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు బీఆర్​ఎస్​కు ఉన్న ఓటు బ్యాంకు మైనస్​ అయ్యేలా కనిపిస్తుంది.  సిరిసిల్ల లో లక్షా మేజార్టీ సంపాదించి మంత్రి కేటీఆర్​ ఈ సారి మేజార్టీలో రికార్డు సృష్టించాలని చూస్తున్నారు.

కానీ సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో మంచి పేరున్న బలమైన నాయకులు లగిశెట్టి శ్రీనివాస్​, యూత్​ నాయకుడు పత్తిపాక సురేష్​ తో పాటు మరో పక్కా బీజేపి నుంచి ఫైర్​ బ్రాండ్​ రాణి రుద్రమ రోజుకో ఆరోపణతో బీఆర్​ఎస్​పై, మంత్రి కేటీఆర్​పై మీడియా ముఖంగా విరుచకుపడుతుంది. తెలంగాణా ఉద్యమనాయకుడు కేకే మహేందర్​ రెడ్డికి కూడ ఈ సారి కాంగ్రెస్​ గ్రాప్​ పెరగడంతో ఓటు బ్యాంకు పెరిగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులు లగిశెట్టి శ్రీనివాస్​ను కాపాడుకుంటే బాగుండని బీఆర్​ఎస్​కు నష్టం చేసే నాయకులు పార్టీలో ఉన్నారని, పార్టీకి పనికివచ్చే నాయకులు బయట ఉన్నరని బీఆర్​ఎస్​ లోనే చర్చ కొనసాగతుంది. సిరిసిల్ల లో రాష్ట్ర  స్థాయి నామీనేట్​ ఇచ్చిన నాయకుడి చేష్టలతో బీఆర్​ఎస్​ పార్టీ పరువు ఆ సామాజిక వర్గంలో సన్నగిల్లింది. పార్టీ ప్రమాణ స్వీకార సమయంలో చందాల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసి పత్రికల్లో ఈ విషయం రావడంతో మంత్రి కేటీఆర్​కు, బీఆర్​ఎస పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. సిరిసిల్ల పట్టణంలో మేజార్టీ సమాజం ఈ నాయకుడి తీరును వ్యతిరేఖిస్తున్నారు. దీంతో బీఆర్​ఎస్​ పార్టీకి సిరిసిల్ల పట్టణంలో ఓ బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నయని రాజకీయ చర్చ కొనసాగుతుంది. బీఆర్​ఎస్​ నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకోవడం.. పలు సామాజిక వర్గాల వారిని కించపరిచేలా మాట్లాడటం.. దూషించడం సిరిసిల్ల పట్టణంలో తీవ్ర వివాదస్పదమైంది. ఇప్పటికి చర్చ కొనసాగుతుంది.  దీనికి తోడు గల్ఫ్​ సమస్యలు పరిష్కరించడం లేదని గల్ఫ్​ జేఏసి తరుపున సిరిసిల్లలో దొనికిని కృష్ణ పోటీ చేస్తున్నారు. గల్ప్​ వలస కుటుంబాల ఓట్లు బీఆర్​ఎస్​ వేయవద్దని, ఏకంగా వారి సంఘాల్లో ఏకగ్రీవ తీర్మాణలు చేసుకోని గల్ప్​ దేశాల నుంచి వారి కుటుంబ సభ్యలతో ఫోన్లో మాట్లాడుతున్నారు.  ఏది ఏమైన సిరిసిల్లలో పద్మశాలీ సామాజికవర్గం నుంచి ఇద్దరు పోటీ చేస్తుండటంతో బీఆర్​ఎస్​ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడనుంది.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş