బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షమీమ్ 46 అప్పుల బాధ భరించలేక సిరిసిల్ల మానేరు వాగులోకి దూకి ఆ*త్మ*హ*త్య చేసుకున్నాడు. తాను కుటుంబ పోషణ నిమిత్తం టైలరింగ్ నిర్వహించుకునే వాడు. ఇటీవల తన కుమార్తె షమీమ్ 25 వివాహం చేయగా చిన్న కూతురు సానియా 19 వివాహం అప్పుల బాధతో ఎలా చేయాలో మనస్థాపం పెరగడంతో బాధలు భరించలెక ఆ*త్మ*హ*త్య చేసుకున్నాడని భార్య కౌసర్ తెలిపారు. ప్రభుత్వం తమకు భరోసా కల్పించాలని వేడుకున్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.