బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.ఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య జెండా ఆవిష్కరించారు. అంత ముందు అంబేద్కర్ విగ్రహానికి మరియు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ: టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకొని తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన సభకు వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు తప్ప ఏం చేయడం లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.