‘ఫ్యూచర్ సిటీ’కి కొత్త బాధ్యతలు
బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మరోసారి భారీ కదలిక మొదలైంది. గత కొద్ది వారాల వ్యవధిలోనే వరుసగా అధికారులను మారుస్తున్న ప్రభుత్వం, తాజాగా 20 మంది ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్స్ ఇస్తూ శనివారం (జనవరి 17, 2026) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేశారు.


