బలగం టీవీ రాజన్న సిరిసిల్ల:
శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి గర్వకారణమైన మహా గణిత శాస్త్రవేత్త. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి కుప్పుస్వామి, తల్లి కోమలతమ్మాళ్ బాల్యంలోనే రామానుజన్ కి గణితంపై అసాధారణమైన ఆసక్తి మరియు ప్రతిభ కనిపించేది. రామానుజన్ పాఠశాల విద్యలో గణితంలో ఎంతో ప్రతిభ చూపారు. అయితే ఇతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో చదువులో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్వీయ కృషితో గణితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. పుస్తకాలు లేకపోయినా, స్వంత ఆలోచనలతో అనేక సూత్రాలు కనుగొన్నారు. తాను ప్రతిభను గుర్తించిన ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ రామానుజన్ను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ ఆయన సంఖ్యల సిద్ధాంతం, అనంత శ్రేణులు, విభజన సిద్ధాంతం వంటి రంగాల్లో విలువైన పరిశోధనలు చేశారు. రామానుజన్ చేసిన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచాయి.రామానుజన్ తక్కువ వయసులోనే అనేక విజయాలు సాధించారు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను 1920లో, కేవలం 32 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అయినప్పటికీ, తాను చేసిన కృషి గణిత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచింది.
శ్రీనివాస రామానుజన్ జీవితం కష్టపడి నేర్చుకుంటే ఏ ఎత్తుకైనా ఎదగవచ్చని చూపిస్తుంది. ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవంను జరుపుకుంటారు. రామానుజన్ భారతదేశ యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారు.గణితం మన దైనందిన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమయం తెలుసుకోవడం, డబ్బు లెక్కలు వేయడం, కొలతలు చేయడం వంటి పనుల్లో గణితం అవసరం. విజ్ఞానం, సాంకేతికత, వైద్య శాస్త్రం, కంప్యూటర్ రంగం, అంతరిక్ష పరిశోధనలలో కూడా గణితానికి ప్రత్యేక స్థానం ఉంది. గణితం లేకుండా ఆధునిక ప్రపంచాన్ని ఊహించలేం. గణిత శాస్త్రం మనలో తార్కిక ఆలోచనను, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరించే నైపుణ్యాన్ని గణితం నేర్పుతుంది. గణితం చదవడం వల్ల క్రమశిక్షణ, సహనం, ఖచ్చితత్వం అలవడతాయి. విద్యార్థులు గణితాన్ని భయపడకుండా ఆసక్తితో నేర్చుకోవాలి. శ్రీనివాస రామానుజన్ సాధారణ కుటుంబంలో జన్మించి, స్వీయ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా ఎదిగారు. సంఖ్యల సిద్ధాంతం, అనంత శ్రేణులు వంటి రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు గణిత ప్రపంచానికి గొప్ప వరం. ఆయన జీవితం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది. గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వ్యాసరచన, ప్రసంగాలు, క్విజ్ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచడంలో సహాయపడతాయి. గణితం కేవలం పరీక్షలకే కాదు, జీవితానికి కూడా ఎంతో అవసరమని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. గణిత దినోత్సవం గణిత శాస్త్ర విలువను తెలియజేసే ముఖ్యమైన రోజు అని సర్పంచ్ గాధగోని సాగర్ తన కీర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు భోజనం ఏ విధంగా ఉందో తెలుసుకుని సంతృప్తి చెందారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్, ఉపసర్పంచ్ యాస సందీప్, వార్డ్ మెంబర్స్ అమరగొండ ప్రభుదాస్,కొమ్మెట మల్లేశం, తిమ్మానగరం దేవదాస్, సింగం శశి కుమార్, యాస శ్రీవాణి, బోడపట్ల రాకేష్, యాస మధు, గ్రామ కార్యదర్శి ముదం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
