జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర
బలగం టీవీ, ములుగు:
తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 సంవత్సరానికి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది.
ఈ మేరకు మేడారం ఆలయ పూజారులు తేదీలను ప్రకటించి, జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

