బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామపంచాయతీలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి కాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమ, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కొండల్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏంజలీనా సందర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి వైద్యులు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వారి నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి లు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
