మనసు మార్చుకున్న మంత్రి కేటీఆర్..
మంత్రి కేటీఆర్ ఫోన్కాల్ లీక్..సిరిసిల్ల లీడర్లతో టెలి కాన్పోరెన్స్
ఇక నుంచి వారానికి రెండు రోజులు సిరిసిల్ల లోనే
ప్రతి కార్యకర్తకు, ప్రజాప్రతినిధితో నేరుగా నేనే మాట్లాడుతా
ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి.. మన అభివృద్దిని గడపగడపకు తీసుకెళ్లండి
బీజేపి, కాంగ్రెస్కు క్యాడర్ లేదు.. ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు
రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తున్నయ్.. మూడవసారి అధికారంలోకి రాబోతున్నం
అసంతృప్తితో ఉన్న లీడర్లను కూడా కలుపుకోనిపొండి..ఆగం కావద్దు
ప్రతిపక్షాల ది కేవలం సోషల్ మీడియాలో లొల్లే.. ఏం కాదు.. ప్రజలు మన వైపు ఉన్నరు
వర్కింగ్ ప్రెసిడెంట్గా.. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుంది కాబట్టే కాస్తా సమయం ఇస్తలేను
ఇక నుంచి ప్రతి ప్రజాప్రతినిధితో నేనే డైరక్ట్గా ఫోన్ కాల్ మాట్లాడుతా.. మధ్యలో ఎవరు అవసరం లేదు..
టెలికాన్పోరెన్స్తో సిరిసిల్ల బీఆర్ఎస్ లీడర్లతో మంత్రి కేటీఆర్ మాట మంతి
బలగం టివి: రాజన్నసిరిసిల్ల:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యుడు, మంత్రి కేటీఆర్ మనసు మార్చుకున్నడు. సిరిసిల్ల నియోజకవర్గంలో తన నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నరు.. ఏం ఆశీస్తున్నరో అర్థం చేసుకున్నరు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను.. నేను వచ్చిన రాకున్న ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి.. బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ది పనులను గడపగడపకు తీసుకెళ్లండి.. గడపగడపకు అంటే ఏదో ఒక కరపత్రం వారి మోహన కొట్టడం కాదు.. ప్రజలుతో మమేకం కండి కూర్చుండి మాట్లాడండి అంటూ .. మంత్రి కేటీఆర్ చాలా స్పష్టంగా.. సిరియస్గా మాట్లాడిన ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సిరిసిల్ల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో, ప్రజాప్రతినిధులతో మంగళవారం ఎన్నికల ప్రచార సరళిపై టెలి కాన్పోరెన్స్ నిర్వహించారు. మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ లీడర్లకు గట్టి క్లాస్ తీసుకున్నారు. మన పార్టీని మనమే పలచన చేసుకునే మాటలు మాట్లాడవద్దు అన్నారు. ఎవరు ఊహించనంత గొప్పగా సిరిసిల్లను అభివృద్ది చేసినం.. పేదలు ఇండ్లు కట్టిచ్చినం..గృహలక్ష్మీ ఇచ్చినం..డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిచ్చినం..సిరిసిల్ల లో ఫలాన వారికి పని చేయలేదు అని వెలెత్తి చూపే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.సిరిసిల్లను జిల్లా చేసుకోని మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇతర విద్యా సంస్థలను, వైద్య సదుపాయాలను మెరుగుపరుచుకున్నమని పేర్కన్నారు.సిరిసిల్లను చూసి వేరే వాళ్లు అసూయపడేట్లు చేసిన..తాగునీటి సమస్య పరిష్కరించినం.. గోదావరి నీళ్లను తెచ్చామన్నారు.సంక్షేమ పథకాలు అందజేస్తున్నం.. పంటలు పూట్లకొద్ది పండుతున్నయ్..రైతులు సంతోషంగా ఉన్నరని బీఆర్ఎస్కు ఓటు వేయకపోవడానికి కారణం అసలు లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి వాగులో పడి కొట్టుకుపోయేటోడు.. ఏమైన చేస్తడు.. సానుభూతి కోసం ఏమైన చేస్తడు పట్టించుకోవద్దు..అది సహజం అన్నారు. ముస్తాబాద్ రోడ్ షోకు వేలాది మంది వచ్చారు..ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రహించానన్నారు. మిగిలింది వారం రోజులు.. రెండు మూడు రోజులు నియోకవర్గంలో నేను అందుబాటులో ఉండి ప్రచారంలో పాల్గొంటాను. గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్ లో వారానికి రెండు సార్లు నేను సిరిసిల్లకు వస్తా..ప్రజలకు అందబాటులో.. అండగా ఉంటానన్నారు. మధ్యలో ఎవరు లేకుండానే నేరుగా అందరితో మాట్లాడుతానన్నారు. తాను ఎన్ని చేసిన ఏం చేసిన తాను అందుబాటులో ఉండి నేరుగా మాట్లాడాలి..కలువాలి అని కోరుకుంటున్నరని గ్రహించానని టెలికాన్పోరెన్స్లో పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్లను చూస్తుంది.. మనం మంచి మేజార్టీ తెచ్చుకోవాలన్నారు. వాడెవడో తాను ఓడిపోతున్ననని రాసిండు.. గా స్థాయికి దిగజారిపోతున్నరు అని కేటీఆర్ తమ క్యాడర్ తో పేర్కొన్నాడు. ఏ సమస్య వచ్చిన వచ్చే ప్రభుత్వంలో చేస్తామని చెప్పాలన్నారు. తాను రాష్ట్రమంతా తిరిగాలి ఈ ఎన్నికల్లో.. సీఎం గారు అంతా తిరగలేరు ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా.. అందుకే మీరే కష్టపడి తిరగండి.. పని చేయండి..అందరిని కలుపుకపొండి.. ఎవరన్న ఏమైన తిట్టిన పట్టించుకోకండి..రెచ్చగెట్టే ప్రయత్నం చేస్తరు.. ఆవేశపడకండి.. మనం ప్రజలకు వివరించే పరిస్థితిలోనే ఉండాలని మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు వివరించారు.