బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్ఠి కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, జిల్లెల విద్యార్థులు తడగొండ గ్రామంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శనతో పాటు వానకాలం పంటల ప్రణాళిక మీద రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా ఏరువాక కేంద్రం, కోఆర్డినేటర్ డా. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాంకేతిక విధానాలని అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే రాబోయే వానకాలంలో రైతులందరూ పంటల సాగులో శాస్త్రవేత్తల చెప్పే మెళకువలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా. శ్రీలత మాట్లాడుతూ.. రైతులందరూ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంటల సరళిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అదే విధంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసినట్లయితే రైతులకు లాభం ఉంటుందని తెలియచేసారు. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల, అసోసియేటెడ్ డీన్ డా. కే.బి.సునీత దేవి మాట్లాడుతూ.. వివిధ పంటలలో నూతన పద్ధతులను మరియు నీటి యాజమాన్యంపై రైతులకు తెలిపారు.

జిల్లా వ్యవసాయ అధికారినీ అఫ్జల్ బేగం మాట్లాడుతూ.. పంటల మార్పిడి మరియు యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు ఇచ్చారు. తదనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డాక్టర్ మధుకర్ రావు, వానకాలం ఆరుతడి పంటల సాగు మరియు ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. తరువాత డా. జి ఉషారాణి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన వంగడాల గురించి తెలిపారు. తరువాత జిల్లా ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త డా.ఎమ్.రాజేంద్రప్రసాద్ వివిధ పంటలలో చీడపీడల గురించి తెలిపారు. వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా గ్రామీణ వ్యవసాయం కృషి అనుభవ కార్యక్రమం విద్యార్థులు, వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్త డా. రాజేంద్రప్రసాద్, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ హెడ్, డా. జి. ఉష రాణి మరియు శాస్త్రవేత్త డా. పి. మధుకర్ రావు, బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఇందుజా, డా. మాధవి, డా. అరుణ్, జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి అఫ్జల్ బేగం, వ్యవసాయ సహా సంచాలకులు రామారావు, మాజీ సర్పంచ్ చిందం రమేష్ , మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి రాజశేఖర్ రెడ్డి,గుడి శ్రీనివాస్ రెడ్డి ,మండల వ్యవసాయ అధికారులు కవిత, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఆర్.ఏ.డబ్ల్యు.ఈ.పి విద్యార్థినులు మరియు రైతులు పాల్గొన్నారు.