.బలగం టివి, ,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మంచి పోషకాహారాలను అందించాలన్నారు.ఈ సందర్భంగా బుధవారం నారాయణపూర్ అంగన్వాడి సెంటర్ల లో విద్యార్థులకు రాగి లడ్డూలను అందించారు. అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.ఒకవైపు ఆటల పాటలతో శరీర దారుడియం. మరొకవైపు చదువును అభ్యసించడం జరుగుతుందన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ మోతే సరిత, ఎంపీటీసీ అపేరా సుల్తానా, మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నరసయ్య,మాజీ ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్,అంగన్వాడీ టీచర్లు తాళ్లపల్లి రేణుక, మోతే లక్ష్మి, అనసూయ గ్రామస్తులు పాల్గొన్నారు.