బలగం టీవీ, బోయినిపల్లి;
మాజీ మండల కో-ఆఫ్షన్ మెంబర్ మహ్మద్ ఆజ్జూ
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. 78 సంవత్సరాలుగా భరతమాత ఎదుర్కొంటున్న దాడులకు, నష్టాలకు, బలిదానాలకు, అవమానాలకు, సహనానికి, ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయింది.శత్రుశేషం లేకుండా శాశ్వత పరిస్కారంతో భరతమాత నుదుట సింధూరం దిద్దాలి.
పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ ఘటన మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని అన్నారు. భారత్ మాతకి జై అంటూ నినాదం చేసిన మాజీ మండల కో-ఆఫ్షన్ మెంబర్ మహ్మద్ ఆజ్జూ.