బలగం టివి ,రాజన్నసిరిసిల్ల
సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లను మెసేజ్ లను క్లిక్ చేసి మోసపోవద్దు.
మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్ కి వచ్చే ఓటిపి ఎవరికి షేర్ చేయద్దు.
సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ….సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.గుర్తు తెలియని నెంబర్ నుండి వచ్చే లింక్స్, మెసేజ్ లు ఓపెన్ చేయవద్దని, మన ప్రమేయం లేకుండా న మొబైల్స్ కి వచ్చే OTP లను ఎవరికి షేర్ చేయవద్దని,లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.
1.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి కాల్ చేసి తనకు సంబంధించిన వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అందుకుగాను హాస్పిటల్ బిల్లుగా 10,000 రూపాయలు పంపించమని చెప్పగా బాద్యుడు 10,000 రూపాయలు పంపించాడు కానీ తర్వాత అదంతా నిజం కాదని తెలుసుకున్నాడు.పది వేల రూపాయలు నష్టపోయారు.
- చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుండి ఏటీఎం కార్డు వచ్చింది కాల్ చేయగా బాధితుడు ఓటిపి షేర్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా బాధితుడు ఆరువేల రూపాయలు నష్టపోయాడు.
- సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఒక నెంబర్ నుండి కాల్ రావడం జరిగింది అందులో భాగంగా బాధితుని మీయొక్క క్రెడిట్ కార్డు అప్డేట్ కోసం అని చెప్పి కార్డు డీటెయిల్స్ మరియు ఓటిపి షేర్ చేసుకోవడం జరిగింది దీని ద్వారా బాధితుడు 30,000 నష్టపోయాడు.
- సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఇంస్టాగ్రామ్ నందు నటరాజ్ పెన్సిల్ కంపెనీ సంబంధించిన ఆడ్ అనుకోని చూసి దాంట్లో ఉన్న నెంబర్ కాల్ చేయగా భావిస్తుంది కంపెనీ యొక్క ఐడి కార్డ్ మరియు సంబంధిత లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రాసెసింగ్ ఫీజుగా 5000 రూపాయలు అడిగారు. బాలేదు దీనిని నిజమైన నమ్మి వారికి 5000 రూపాయలు పంపడం జరిగింది కానీ తర్వాత అతను 5000 రూపాయలు నష్టపోయాడం తెలుసుకున్నాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
• మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.
• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.
• సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.
• మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.