ఏకగ్రీవ తీర్మాణాలు.. బీఆర్ఎస్ నేతల మధ్య పంచాయతీ
తీరు మార్చుకోని సెస్ చైర్మన్ చిక్కాల.. గెలిపుకు కృషి చేసిన నేతలనే దూరం పెడుతున్నడు
సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడిని పిలవకుండానే కుల సంఘాల ఏకగ్రీవ తీర్మాణాలు
సొంత గ్రామంలో సర్పంచ్ వేణుగోపాల్రావుకు ఆహ్వానం కరువు
ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్కు తలనొప్పులు తెస్తున్న సెస్ చైర్మన్ చిక్కాల
అలిగిన వేణుగోపాల్ రావు.. బుజ్జగించిన బీఆర్ఎస్ నేతలు
ఇద్దరి పంచాయతీ బీఆర్ఎస్ అధిష్టానం వద్దకు
సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి మండలం:

రాజన్నసిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఏకపక్ష నిర్ణయాలు.. మండల ప్రజాప్రతినిధులను కొంత మందిని దూరం పెట్టి గ్రూపు రాజకీయాలకు తెరలేపినట్లు చర్చ కొనసాగుతుంది. చిక్కాల రామారావును సెస్ డైరక్టర్గా గెలిపించడానికి కృషి చేసిన వారినే దూరం పెడుతూ.. కార్యక్రమాలకు ఆహ్వనించకుండా అవమానపరడంతో తంగళ్లపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వలకొండ వేణుగోపాల్ రావు తీవ్ర ఆవేధనకు గురయ్యారు. వేణుగోపాల్ రావు సర్పంచ్ గా ప్రతినిధ్యం వహిస్తున్న కస్బె కట్కూర్ గ్రామంలో గౌడ, యాదవ సంఘాలు బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపి.. కేటీఆర్ కే మా ఓటు అని శనివారం ఏకగ్రీవ తీర్మాణాలు చేయించే కార్యక్రమానికి అదే గ్రామ సర్పంచ్ ఐన వలకొండ వేణుగోపాల్ రావు కు సమాచారం ఇవ్వలేదు. గ్రామం మొత్తం ఏకగ్రీవ తీర్మాణం చేయించే పనిలో సర్పంచ్ వేణుగోపాల్రావు కసరత్తు చేస్తుండగా రెండు సామాజిక వర్గాలను కస్బె కట్కూర్ నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి పిలిపించుకోని ఏకగ్రీవ తీర్మాణాల కార్యక్రమంను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు నిర్వహించారు. తన సొంత గ్రామ కార్యక్రమానికి పిలవకపోవడంపై వేణుగోపాల్రావు మంత్రి కేటీఆర్కు, బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశాడు. అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా… లేనా.. ఎందుకు గుర్తించడం లేదు..సర్పంచ్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నరంటూ వేణుగోపాల్రావు తీవ్ర స్థాయితో ధ్వజమెత్తారు.దీంతో బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షులు గజభీంకార్ రాజన్న కల్పించుకోని వేణుగోపాల్రావును బుజ్జగించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్ నాయకుడు చీటీ నర్సింగరావు కల్పించుకోని వేణుగోపాల్ రావును సిరిసిల్ల తెలంగాణ భవన్కు పిలిపించుకోని సమస్యను పరిష్కరించారు.చిక్కాల రామారావు తో మాట్లాడించి మరోసారి ఇలా కాదని, ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తామంటూ చెప్పించినట్లు తెలిసింది.

చిక్కాలది.. వలకొండది ఒక్కటే గ్రామం.. ఐన రాజకీయ వైరం
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ది సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు వలకొండ వేణుగోపాల్ రావుది కస్బె కట్కూర్ గ్రామమే. వీరి మధ్య రాజకీయ వివాదం గత కొంత కాలంగా కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావు సెస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవ్వగా.. వేణుగోపాల్ రావు, జూపల్లి వెంకట్రావ్, రాజురావులు చీటీ నర్సింగరావుకు సపోర్ట్ చేసి ప్రచారం నిర్వహించారు.దీంతో అప్పటి నుంచి వేణుగోపాల్ రావును రాజకీయ శత్రువుగా చూస్తున్నట్లు సమాచారం. ఐన సెస్ ఎన్నికల పోటీ నుంచి చీటీ నర్సింగరావు తప్పుకోని రామారావు గెలుపు కోసం కస్బె కట్కూర్ నాయకులు వేణుగోపాల్ రావు, వెంకట్రావ్, రాజు రావులతో పని చేయించి చిక్కాల రామారావు గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల వరకు బాగానే ఉన్న చిక్కాల ఎన్నికల్లో గెలిచి..సిరిసిల్ల సెస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించగానే మనసు మార్చుకున్నాడు. తనకు పడని వారిని దూరం పెడుతూ.. తనకు అనుకూలంగా ఉన్నవారికి మండలంలో రాజకీయ ప్రాముఖ్యతను కల్పిస్తున్నారు. జిల్లా స్థాయి నాయకుడైన చిక్కాల గ్రామ రాజకీయాల్లో తలదర్చడంతో మండలంలో రాజకీయ తలనొప్పులు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని పలువురు బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికల వేళ ప్రజాప్రతినిధులతో గొడవలు పెట్టుకుంటే నష్టం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైన సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో మంత్రి కేటీఆర్ కు రాజకీయ చిక్కులు ఏర్పడేలా ఉన్నాయని రాజకీయంగా చర్చ కొనసాగుతుంది.
