బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
-పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద ధర్నా విజయవంతం చేయండి.
-సి ఐ టీ యు రాష్ట్ర అధ్యక్షుడు ముశం రమేష్
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు మెరుగైన వేతనం ఇవ్వాలని,ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని – సిఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు ముశం రమేష్ డిమాండ్ చేశారు.
మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని అమృత శుక్ల కార్మిక భవనంలో వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి సి ఐ టీ యు రాష్ట్ర అధ్యక్షుడు ముశం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ యజమానుల వైఖరి నిరసిస్తూ పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద బుధవారంధర్నా నిర్వహించడం జరుగుతుందని, వార్పిన్. వై పని పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పవర్లూమ్, వార్పిన్, వై పని కార్మికులు 15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తో సమ్మె విరమించడం జరిగిందని అన్నారు. వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగిందని, కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదని అన్నారు.
కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారనిఅన్నారు.బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు కూలి ఉంటే, ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారని అన్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పని కంటే, విపరీతమైన పని భారం పెరిగిందని, చిన్నకోములు వస్తున్నాయని,పోగులు పెరిగినాయని, అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి, యజమానులు ఒప్పుకోవడం లేదని అన్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం,యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగిందని అన్నారు.
అధికారుల యజమానుల మధ్య.కార్మికులునష్టపోవడం జరుగుతుందని, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, బుట్ల వెంకటేశం, దోమల రమేష్, ఐరన్ ప్రవీణ్, సామల శీను తదితరులు పాల్గొన్నారు.