5 రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
శనివారం కలెక్టరేట్ కార్యాలయ అవరణలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార వాహనాల ప్రారంభ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండిసంజయ్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పాల్గోన్నారు. శనివారం సాయంత్రం వర్చువల్ గా వాహనాలను భారత ప్రదాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రదాని ప్రసంగాన్ని ఎల్ ఈ డి స్క్రీన్ ద్వారా అధికారులతో కలసి వీక్షించారు. అనంతరం జిల్లా జిల్లా కలెక్టర్ తో కలిసి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాలను ఎంపీ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపి మాట్లాడుతూ, 2047 నాటికీ అభివృద్ది చెందిన భారతదేశంగా తయారు కావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దేశంలోని ప్రతి మారుమూల గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారులకు చేరే విధంగా సంకల్పయాత్రను కొనసాగించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులను కలవడంతొ పాటు వారిద్వారా ఇతర ప్రజలుసహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా మద్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ఘడ్, తెలంగాణా, మిజోరాం రాష్ట్రాలలో ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
దాదాపు 55 కోట్ల మంది ప్రజలకు పైగా ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద పేద ప్రజలకు 5 లక్షల విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందించడం జరుగుతుందని. దాదాపు 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లను అందించడం జరిగిందని, 11 కొట్లకు పైగా కిసాన్ సమ్మాన నిధి పేరుతో రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలను అందించడం జరుగుతుందని తెలిపారు. నిలువనీడలేని దాదాపు 4 కోట్లమంది పేదలకు ప్రదానమంత్రి ఆవాస్ యోజన ప్రథకం క్రింద ఇళ్లున నిర్మించడం జరుగుతుందని తెలిపారు. 80 కోట్లకు పైగా ప్రదానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన ప్రథకం క్రింద ఉచితరేషన్ అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్దితో దేశాన్ని అభివృద్ది పరచాలనే ఉద్దేశ్యంతో 5 రాష్ట్రాల్లో యాత్రను ప్రదానమంత్రి యాత్రను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమానికి అందరు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డిఆర్డిఓ శ్రీలత, ఎల్ డి ఎం ఆంజనేయులు, ఎస్బియం కిషన్ స్వౌమి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, నెహుయువ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, ఎల్డియం ఆంజనేయులు, ఎన్ ఐ ఓ శివ రాములు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.