వేములవాడ అర్బన్ బిజెపి మండల శాఖ అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్
బలగం టీవీ, వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నంది కామన్ చౌరస్తా వద్ద కేంద్రప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన జరిపే విధంగా తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు జింక శ్రీనివాస్, ఎరుగోక్కుల రమేష్, కార్యదర్శి కొలనూరి సంజీవ్ రెడ్డి, నాయకులు ముడికే రాములు,ముదం శ్రీనివాస్, పోచంపల్లి శ్రీకాంత్, బొల్లు తిరుపతి, గుగ్గుళ్ల చిన్న, రాగుల రామకృష్ణ, పేరంగిణి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.