బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో పెట్టవద్దని,మొత్తం 167 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రజావాణిలో డీఆర్డీ ఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.