ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షణ
బలగం టీవీ, హైదరాబాద్:
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఈరోజు (డిసెంబర్ 13, 2025) హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ను, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆడుతున్న మ్యాచ్ను ఆయన వీక్షించనున్నారు.
రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుండి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కు చేరుకుని, సాయంత్రం 7 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. 7 గంటల తర్వాత, ఆయన ఉప్పల్ స్టేడియంకు బయలుదేరి, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షిస్తారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
