బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమంలో తన గళంతో స్ఫూర్తిని నింపిన రాజాగౌడ్, గల్ఫ్ దేశంలోనూ తన పాటతో గుర్తింపు పొందారు. యూఏఈలో ఉన్న గల్ఫ్ కార్మికుల కోసం ‘మా గల్ఫ్ న్యూస్’ నిర్వహించిన ఆన్లైన్ పాటల పోటీల్లో రాజాగౌడ్ థర్డ్ ప్రైజ్ సిగార్ అవార్డును గెలుచుకున్నారు. దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు గ్రహీత కె. చంద్రబోస్ మాట్లాడుతూ, కార్మిక గీతాలాపన సింగర్ల పేర్లు తన దృష్టికి రావడంతో, స్వయంగా రాజాగౌడ్ను థర్డ్ ప్రైజ్కు ఎంపిక చేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కోళ్లు రవీంద్ర మాట్లాడుతూ, రాజాగౌడ్ పాడిన పాటలో గల్ఫ్లోని కార్మికుల బాధ చక్కగా అర్థమవుతోందని అన్నారు. గల్ఫ్లో ఉన్న కార్మికుల కోసం ‘మా గల్ఫ్ న్యూస్’ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
అవార్డు అందుకున్న అనంతరం రాజాగౌడ్ మాట్లాడుతూ, తమలోని ప్రతిభను గుర్తించి అవార్డులు అందించిన ‘మా గల్ఫ్ న్యూస్’ వ్యవస్థాపకులు శ్రీకాంత్, ఎడిటర్ చీఫ్, సౌమ్య (రిపోర్టర్, మా గల్ఫ్ న్యూస్ యూఏఈ)లకు గల్ఫ్ దేశాల్లోని 15 లక్షల మంది కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

గతంలో వెల్లుల్ల గ్రామానికి చెందిన బత్తిని రాజాగౌడ్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి, మారుమూల గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సేవా సంస్థల ద్వారా జిల్లా స్థాయిలో “గ్రామీణ కళజ్యోతి” అవార్డు, రాష్ట్ర స్థాయిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో సౌదీ అరేబియా బెస్ట్ సింగర్ అవార్డుతో పాటు మరో 49 అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షుడిగా ఉన్న బత్తిని రాజాగౌడ్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గల్ఫ్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.