బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
దేశవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నవేల ముందు జాగ్రత్త చర్యలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల మీద పన్నెండు అడుగుల పొడవు వెడల్పుల తెలుపు రంగు మీద నాలుగు అడుగుల ఎరుపు రంగులో రెడ్ క్రాస్ వేయడం జరిగింది. ఇందులో భాగంగా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి భవనం మీద వేయడం జరిగింది. యుద్ధ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియమాల్లో భాగంగా ఈ విధమైన గుర్తు వేయడం జరిగిందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలియజేశారు.